కడప నగర టిడిపి అధ్యక్షుడు పై దాడి!కడప నగర టిడిపి అధ్యక్షుడు పై దాడి!
రెండు రోజులు గడుస్తున్న నిందితులెవరో గుర్తించకపోవడం
సొంత పార్టీ నాయకులే పరామర్శించకపోవడంతో విమర్శలు.
కడప ప్రతినిధి :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు కాలం పూర్తి చేసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ నాయకులు పై దాడులు, హత్యలు, జరుగుతున్నాయని ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సానపు రెడ్డి శివకొండ రెడ్డి పై హత్య యత్నం జరగడం తీవ్ర సంచలనంగా మారింది.
అధికార పార్టీ అధ్యక్షుడు పై దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్న పోలీసులు నిందితులను గుర్తించకపోవడంతో పలు అనుమానాలు కి తావిస్తుంది.
సొంత పార్టీ నాయకుడు పై దాడి జరిగితే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పరామర్శించకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు.
ఇదిలా ఉండగా , వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి అంజిద్ భాష పరామర్శించడం కోసం మెరుపుగా మారింది.