*ప్రతి ఒక్కరూ మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలి : ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: జడ్పీచైర్మన్ తో కలసి ఏర్పాట్లు పరిశీలన*
*ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంగా ఎంజీఆర్ ఫౌండేషన్ స్వంత నిధులతో నిర్మించిన ఎంజీఆర్ మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*
*గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ప్రజాప్రతినిధులతో కలసి బస్టాండ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందచేశారు.*
*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ఎంజీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.4.50 కోట్ల నిధులతో నిర్మించిన మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవం ఈ నెల 23న శుక్రవారం జరగనున్నట్లు వివరించారు.*
*ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు మంది రాష్ట్ర మంత్రులు, నలుగురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉప ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరుకానున్నారని వివరించారు.*
*ఉపముఖ్యమంత్రివర్యులు షేక్ అంజాద్ బాష, కె నారాయణస్వామి, రాష్ట్రవ్యవసాయశాఖ మాత్యులు కాకాణి గోవర్థన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మాత్యాలు పెనిపె విశ్వరూప్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తదితరులు హాజరుకానున్నట్లు వివరించారు.*
*ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన మౌళిక సదుపాయలు ఇప్పటికే ఆయా మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆత్మకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమ గురించి ప్రకటన చేసే అవకాశముందని వివరించారు.*
*ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన ఈ బస్టాండ్ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.*
Comments are closed.