సౌత్ 9 ప్రతినిధి :
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలపై స్పేస్ ఎక్స్ అధినేత బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్ మరోసారి ఆరోపణ చేశారు కృత్రిమ మేథ అయిన ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ ఉత్తమమని తన వాదన వినిపిస్తున్నాడు టెక్ నిపుణునిగా తనకున్న పరిజ్ఞానంతో ఈ విషయం చెప్తున్నా అని పేర్కొన్నారు అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాలని ఆయన సూచించారు ప్రజాస్వామ్య దేశాలలో ఎన్నికలవేళ పేపర్ బ్యాలెట్ ఉపయోగించడమే ఉత్తమమైన మార్గమని ఆయన పేర్కొన్నారు ఈవీఎంల హ్యాక్ చేయడం చాలా సులభమని ఆయన తెలిపారు ఈయన మొదటిసారిగా ఇటీవల జరిగిన భారత ఎన్నికల తర్వాత ఇదే విషయంపై గళం విప్పారు ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి సమయంలో మరోసారి ఈవీఎంలు హ్యాక్లపై తన స్వరం వినిపిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది